Tuesday, January 5, 2010

అయినను పోయి వచ్చితిరి హస్తినకు.....

తెలుగులో "పుల్లయ్య వేమవరం" అని ఒక నానుడి ఉంది. మన నేతల తీరు తెన్నులు చూస్తుంటే అచ్చంగా అలాగే అనిపించింది. పొలోమంటూ ఢిల్లీ చేరి చర్చిస్తాం, పొడి చేస్తాం అని వెళ్లి అసలేం జరిగిందో, జరుగుతోందో, జరగబోతోందో ఏ మాత్రం క్లారిటీ లేకుండా ఆ తంతు కాస్తా ముగించారు. దీన్ని బట్టి "మనవాళ్ళుత్త వెధవలోయ్!" అన్న గిరీశం మాటలు నిజమే అనిపిస్తోంది. పైగా అక్కడికెళ్ళి దేశప్రజలందరి ముందూ మనకు కాస్తో...కూస్తో మిగిలున్న పరువు కూడా అరుపులు, కేకలు, నినాదాలతో తీసిపారేశారు. మీడియా ముందు సీనియర్ నేతలు కూడా పక్కవాడి శాలువా లాగడం, టోపీలతో ఆడుకోవడం చూస్తే అసలు వీళ్ళకి రాష్ట్రాన్ని బాగుచేయలన్న ఆలోచన ఉందని ఏ ఒక్కడైనా అనుకుంటాడా? . మొత్తం మీద అందరూ కలిసి సమస్య పేరుతొ రాజధానికి చేరి పిక్నిక్ చేసుకున్నట్టు ఉంది. మన నేతలిలా ఉన్నంతకాలం మన రాతలూ ఇలానే ఉంటాయి. ఏం చేస్తాం ఓటు హక్కు దుర్వినియోగం చేసిన పాపం ఊరికే పోతుందా!!!!!!