Sunday, January 30, 2011

మహాత్మా గాంధి రచనకు ఇళయరాజా స్వరకల్పన చేయగా పండిట్ భీమ్ సేన్ జోషి పాడిన పాట మరోసారి మీకోసం


నిజానికి ఇది గత సంవత్సరం జూన్ రెండవ తేదీన ఇళయరాజా పుట్టిన రోజు సందర్భం గా పెట్టిన పోస్ట్. అయితే ఈ మధ్యే దివంగతులైన పండిట్ భీమ్ సేన్ జోషి కి , మహాత్ముని వర్ధంతి సందర్భంగా వారిరువురికీ నివాళిగా మరోసారి పోస్ట్ చేస్తున్నా. అప్పట్లో బ్లాగ్ లో వీడియో ఎలా పెట్టాలో తెలియనందున కేవలం లింక్స్ మాత్రమే ఇచ్చా. ఇప్పుడు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నా. 

దేశంలోని అతి కొద్ది మంది సంగీత మేధావులలో ఒకరైన ఇళయరాజా స్వరపరచిన మహాత్మాగాంధీ గీతం (రాసినది అచ్చంగా మహాత్ముడే) "నమ్రతా కే సాగర్" గీతాన్ని మీకోసం అందిస్తున్నాను. ఇది ఒక అరుదయిన కాంబినేషన్, మన ఆల్ ఇండియా రేడియో స్టైల్ లో చెప్పాలంటే 
రచన: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 
సంగీతం: ఇళయరాజా
గానం: పండిట్ భీమ్ సేన్ జోషి 
వ్యాఖ్యానం: అమితాబ్ బచ్చన్



ఈ పాటను డౌన్ లోడ్ చేసుకోడానికి ఈ లింక్ లను క్లిక్ చేయండి 




1 comment:

Ennela said...

bhalE baagundanDee...maato panchukunnanduku.. ..laakh laakh shukuriya...